తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో వార్షిక షీ టీమ్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. 10k, 5k మరియు 2k రన్లో 8,500 మందికి పైగా పార్టిసిపెంట్లు పాల్గొంటున్నారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సినీ నటులు హారిక, పూజా హెగ్డే తదితర ప్రముఖులు పాల్గొన్నారు.